పసుపు కండువాలు కప్పుకున్న తాడేపల్లి టౌన్ నేతలు, కార్యకర్తలు
మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టిడిపి యువనేత నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, రాజుపాలెం పిఎస్అర్ కళ్యాణమండపం క్యాంప్ సైట్ వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తాడేపల్లి టౌన్ నుంచి వచ్చిన నేతలు లోకేష్ని కలిసి టిడిపి బలోపేతానికి కృషి చేస్తామని మాటిచ్చారు. తాడేపల్లి టౌన్కి చెందిన మాజీ కౌన్సిలర్ కాటాబత్తిని నిర్మల, సాగర్ బాబు దంపతులు, కాటాబత్తిని పవన్ కుమార్, కాటాబత్తిని చిన్నపాపారావు, తురకా నాగవేణి, షేక్ వహీదా, దొంతిరెడ్డి మధుసూదన్ రెడ్డిలకి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లోకేష్. ఈ కార్యక్రమంలో తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, తాడేపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కొయ్యగూర మహాలక్ష్మి, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా సుబ్బారావు, నియోజకవర్గ పరిశీలకుడు ముమ్మిడి సత్యనారాయణ,షేక్ మస్తాన్ వలి, కాకుమాను కుమార్, అన్నెం కుసుమ,షేక్ చాంద్ బాషా,తోట సాంబశివరావు, షేక్ నాగుల్ మీరా,షేక్ జాన్ షైదా, గోలి శౌరి,తదితరులు ఉన్నారు