చిల్కానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎం.కుమార్(బుచ్చి) మరియు అతని మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చిల్కానగర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాస శేఖర్ నేతృత్వంలో జరిగిన చేరికల కార్యక్రమంలో మేకల కుమార్, హనుమాన్ సింగ్, బి.కిరణ్ కుమార్, డి కిషన్, డి.రవి, బాబు యాదవ్, పి.నాగిరెడ్డి, శ్రీధర్ చారి తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు మేకల జీవన్ కుమార్, బోన.అనీష్, పొట్ట వినోద్ కుమార్ తదితర పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా