విజయనగరం లో ఎస్ఎఫ్ఐ స్డూడెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. సిక్కోలు లో ప్రారంభమైన సమరభేరి బస్సు యాత్ర జిల్లా లోకి ప్రవేశిస్తున్న తరుణంలో జేడ్పీ లో సమావేశ మందిరం వద్ద ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఉండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
అంతకు ముందు కాంప్లెక్స్ వద్ద లావు గంగాధర్ భవన్ వద్ద సీసీఎస్ పోలీసులు, వన్ టౌన్ పోలీసులు కనిపించారు. అప్పటికే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ చేయబోతున్న ఆందోళనలు కట్టడి చేసేందుకు సిద్దమయ్యారు. కానీ అంతలోనే వాళ్లు జేడ్పీ కి వెళ్లారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు.
ఈ క్రమంలో అక్కడున్న ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ హర్షను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము సదస్సు కు వస్తే ఎందుకు అదుపులోకి తీసుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అటు పోలీసులు, ఇటు విద్యార్థుల మధ్య మాట మాటా పెరిగింది.
ఈ సమయంలో నే పోలీసులు విద్యార్థులు బలవంతంగా అదుపులోకి తీసుకుని జీపు ఎక్కించారు. దీంతో పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేసారు.. విద్యార్థులు. అయినప్పటికీ వన్ టూటౌన్ పోలీసులు బలవంతంగా విద్యార్థులను అరెస్టు చేశారు.