40.2 C
Hyderabad
April 29, 2024 18: 44 PM
Slider నల్గొండ

ఎన్ ఎస్ పి కాలవ కట్టపై కూల్చిన గుడిసె వాసులకు నష్టపరిహారం చెల్లించాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్ ఎస్ పి కాలవ కట్టపై పేదల గుడిసెలు కూల్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

అనంతరం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ కార్యదర్శి నాగరాపు పాండు మాట్లాడుతూ ఎటువంటి సమాచారం లేకుండా,ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చిన గుడిసెల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని,ప్రస్తుతం మౌలిక వసతులు కల్పించాలని,అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షాన సుదీర్ఘమైన పోరాటానికి ఇళ్లను కోల్పోయిన నిర్వాసితులు సిద్ధం అవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లె వెంకటరెడ్డి,దుర్గి బ్రహ్మం,ఇందిరాల త్రివేణి, యల్క సోమయ్య గౌడ్,జక్కుల వెంకటేశ్వర్లు,వీరమల్లు,వెంకన్న,వీరబాబు, సాంబయ్య,నిర్వాసితులు జాల రామయ్య,గుంజ ఉమా,కారంగుల పాండు,గడ్డం మంగమ్మ,ధరావత్ శైలజ, నాగరాజు,వెంకటేశ్వర్లు దుర్గారావు,రమ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: పన్నాల దేవేందర్ రెడ్డి

Bhavani

సిఎం కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధి

Satyam NEWS

21న ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ ఎంజిఎం సందర్శన

Satyam NEWS

Leave a Comment