35.2 C
Hyderabad
May 1, 2024 00: 46 AM
Slider ఖమ్మం

202 మందికి  రూ.2 కొట్లు విలువైన చెక్కులు పంపిణి

#puvvada

ఖమ్మం మున్సిపల్‌ కార్పోరేషన్ పరిధిలోని మంజూరైన 202-కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కును ఆయా డివిజన్లలోని లబ్ధిదారుల కుటుంబాలకు రెండు రోజుల పాటు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెక్కులను స్వయంగా మోటార్ సైకిల్ పై వెళ్లి పంపిణీ చేశారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో మంజూరైన 202 చెక్కులను రెండు రోజుల పాటు పంపిణీ చేయలనే నిర్ణయం మేరకు  వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేశారు.

తొలి రోజు ఉదయం 2వ టౌన్, 3వ టౌన్ నందు మొత్తం 98 చెక్కులను గాను రూ.98 లక్షలు, నేడు వన్ టౌన్, ఖననాపురం, అల్లిపురం, ప్రాంతాలలో 104 చెక్కులు మొత్తం 202 చెక్కులకు గాను రూ.2.02 కోట్ల విలువైన చెక్కులను మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్లి లబ్దిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. ఆయా లబ్దిదారులకు మంజూరైన రూ.లక్ష చెక్కతో పాటు చీర, పండ్లు అందజేశారు. దీంతో లబ్ధిదారులు తమ వద్దకే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా చెక్కును ఇవ్వడం పట్ల మంత్రి పువ్వాడ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఎల్ఐసి ప్రయివేటీకరణపై సిబ్బంది నిరసన ధర్నా

Satyam NEWS

తొలి బ్యాచ్ ఆర్టీసీ శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు

Satyam NEWS

మార్పుల‌కు, విప్ల‌వానికి ఓయూ కేంద్రం

Sub Editor

Leave a Comment