32.2 C
Hyderabad
May 2, 2024 01: 35 AM
Slider తెలంగాణ

సీఎం కేసీఆర్‌తో డోనాల్డ్ ట్రంప్‌ కరచాలనం

kcr trump

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక విందు ఇచ్చారు. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్‌ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరచాలనం చేశారు. సీఎం కేసీఆర్‌ తనను తాను ట్రంప్‌కు పరిచయం చేసుకున్నారు.

Related posts

విశాఖ నగరంలో పట్టుబడ్డ కోటి రూపాయలు

Satyam NEWS

డామిట్ కథ అడ్డం తిరిగింది: ఏపి ఉద్యోగులలో చీలిక

Satyam NEWS

ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment