29.7 C
Hyderabad
May 3, 2024 06: 24 AM
Slider నిజామాబాద్

ఈ నెల 8 న కామారెడ్డిలో వై ఎస్ షర్మిల పాదయాత్ర

#yssharmila

ఈ నెల 8 న కామారెడ్డికి వైఎస్ఆర్టిపి అధినేత వైఎస్ షర్మిల పాదయాత్ర రానుందని ఆ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నీలం రమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనిలో గల పార్టీ కార్యాలయంలో పాదయాత్రకు సంబందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్టిపి అధినేత షర్మిల చేపట్టిన పాదయాత్ర 2400 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కామారెడ్డి జిల్లాతో 2500 కిలోమీటర్లకు చేరుకుంటుందన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ సేవలు ప్రజలకు గుర్తు చేస్తూ 175 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిందన్నారు. పాదయాత్ర సమయంలో ప్రతి గ్రామంలో రాజన్న రాజ్యం రావాలి.. సంక్షేమ పాలన రావాలి అంటూ ప్రజలు కపరుకుంటున్నారని తెలిపారు.

ఇక్కడ కూడా ప్రజలు రాజన్న కూతురును ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి వ్యక్తి ఈ నెల 8 న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్, పట్టణ అధ్యక్షుడు తాహెర్, పోలింగ్ బూత్స్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మిస్టరీ: తిరుమల లో ఉద్యోగి ఆత్మహత్య కు కారణమేంటి?

Satyam NEWS

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64 మంది మృతి

Sub Editor

సైకిల్ పై ఖమ్మం నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment