ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 64కి చేరుకుంది.. శిథిలాలను వెలికితీస్తున్న కొద్దీ గల్లంతైనవారి మృతదేహాలు బయటపడుతున్నాయి.. విరిగిపడిన కొండ చరియలను తొలగించడంతో పాటు సహాయక చర్యలను సహాయక సిబ్బంది ముమ్మరం చేశారు.
ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాకులు, బ్రిడ్జిలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత, వరదల కారణంగా ఇప్పటి వరకూ 64మంది మృత్యువాత పడ్డారు. 11మంది గల్లంతయ్యారు.
నైనితాల్ జిల్లాలో 34 మంది, చంపావత్ జిల్లాలో 11 మంది మృతిచెందారు. ప్రభుత్వ అంచనాల మేరకు వరదల కారణంగా దాదాపు రూ.7000 కోట్ల నష్టంవాటిల్లింది.