మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కీసరలోని శివ లింగాలకు భక్తులు క్షీరాభిషేకాలు చేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని భక్తులు పరవశులయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి కృపకు పాత్రులయ్యారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎనుముల రేవంత్ రెడ్డి కీసర విచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.