37.2 C
Hyderabad
April 26, 2024 20: 59 PM
Slider తెలంగాణ

సూర్యాపేట జిల్లాలో మరో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం

tharmal

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద 300 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మెక్వెల్ కంపెనీ ప్రతిపాదించింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల రెండు యూనిట్లతో ఉన్న ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రకారం 332 ఎకరాలలో దీన్ని రూ. 2,160 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తారు.

ఈ డీపీఆర్ ను రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీకి సమర్పించారు. దీన్ని ఆ తర్వాత పర్యావరణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ థర్మల్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసమే వాడుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు.

పులిచింతల హైడల్ డ్యామ్ ప్రాజెక్టు వద్ద నున్న 220 కెవిఏ ట్రాన్స్ ఫార్మార్ ద్వారా ఈ విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం వినియోగిస్తారు. మొదటి దశ ప్రాజెక్టును అనుమతులు వచ్చిన 27 నెలల్లోనే పూర్తి చేస్తారు. రెండవ దశను మూడు నెలల వ్యవధిలో ప్రారంభిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 12 నిర్మాణ ఒప్పందాలు, సాంకేతిక ఒప్పందాలు ఉంటాయి.

రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిమాండ్ ను ఏడాదికి ఆరు శాతంగా లెక్కించి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ విద్యుత్ ప్రాజెక్టు అవసరమైన బొగ్గును సింగరేణి కాలరీస్ నుంచి, అంతర్జాతీయ బొగ్గు అమ్మకందార్ల నుంచి ఏడాదికి 2.01 మిలియన్ టన్నులను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ బొగ్గు రవాణాకు సింగరేణి నుంచి మేళ్లచెర్వు రైల్వేస్టేషన్ ద్వారా ప్రత్యేకంగా రైల్వే లైన్ వేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కు తొలి ఏడాది లో కిలో వాట్ కు రూ.4.82 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.  ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నిర్వహణ ఖర్చు రూ.3.20 కోట్లు గా అంచనా వేస్తున్నారు. కేంద్ర విద్యుత్ సంస్థల నిబంధనల ప్రకారం ఆ తర్వాతి ఏడాదిలో నిర్వహణ ఖర్చు సుమారుగా ఆరు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Related posts

కర్నాటక తరహాలో ఉద్యమించి అధికారం చేజిక్కించుకుందాం

Satyam NEWS

సిర్పూర్ గడ్డపై దోపిడీ పాలన పోవాలి

Satyam NEWS

చంద్రబాబు కుట్ర వల్లనే ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరణ

Satyam NEWS

Leave a Comment