నాగర్ కర్నూలు జిల్లాలో గ్రామాల అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న 18 గ్రామాల సర్పంచులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష షోకాజ్ నోటీస్ జారీచేశారు. గ్రామాల్లో స్మశాన వాటికలు డంపింగ్ యార్డులు, చెత్తతో ఎరువు తయారీ కేంద్రాల నిర్మాణాల్లో 18 గ్రామ పంచాయతీల సర్పంచులు అలసత్వం ప్రదర్శించారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోడేరు మండలంలో తూర్కదీన్నె, ఎర్రన్న భావి తాండ, తీగలపల్లి, నాగులపల్లి తాండ, పెద్దకొత్తపల్లి మండలంలో వెన్న చర్ల, చంద్రకల్, నారాయణపల్లి, జొన్నల బొగుడ, తెలకపల్లి మండలంలో పార్వతి పూర్, తాడూర్ మండలంలో తుమ్మల సుగుర్, వంగూర్ మండలంలో చౌదర్ పల్లి, లింగాల మండలంలో రాంపూర్, మర్రికుంట తండా,
పెంట్లవెల్లి మండలంలో సింగవరం, కొల్లాపూర్ మండలంలో కుడికిల్ల, ఉప్పునుంతల మండలంలో ఉప్పునుంతల, వెల్టూర్ ,అయ్యవారిపల్లి గ్రామాల సర్పంచులకు గ్రామాలలో అభివృద్ధి పనులలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మంగళవారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.