దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు రుణమాఫీ, రైతుబంధు సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ గా నర్మద ముత్యం రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినందున ఆమె నేడు పదవీ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ధాన్యం మొక్కజొన్న కొనుగోలు తెలంగాణ రాష్ట్రం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పార్టీ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు శాఖ అధికారులు ఏ డి శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు.