ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి కావాలని వెంకటాపురం నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేస్తున్న ప్రసాద్, సురేష్ లకు అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి బిఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ లాగా భారత్ దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని కెసిఆర్ ఇదే దిశ గా వెళ్లి ప్రధానమంత్రి కావాలని అభిమానం తో వారు పాదయాత్ర ప్రారంభించారు.
వెంకటాపురం నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేస్తున్న అయిజ మండల వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రసాద్, సురేష్ లకు మార్గ మధ్యలో కలిసి అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ సంఘీభావం తెలిపారు. వారు ప్రగతి భవన్ చేరే వరకు వారి అవసరాలను తీరుస్తానని ఏ ఇబ్బంది వచ్చినా తనను చరవాణి ద్వారా సంప్రదించాలని వారికి సూచించారు. వీరి వెంట ఆనంద్, ప్రభాకర్, హుస్సేన్, విజయనాయుడు, విజయ్, సంపత్, కార్తీక్, తదితరులు ఉన్నారు.