పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తప్పుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించవచ్చని తెలుస్తోంది.
దీనిపై చర్చించేందుకు హైకమాండ్ సీఎం చరంజిత్ చన్నీని, ఎంపీలు రవనీత్ బిట్టు, కుల్జీత్ నగ్రాను కూడా ఢిల్లీకి పిలిపించింది. సిద్ధూ రాజీనామాను ఆమోదించిన తర్వాత, బిట్టు లేదా నాగ్రాను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయవచ్చు. కాంగ్రెస్ హైకమాండ్, సిద్ధు పట్టుబట్టడంతో..సునీల్ జాఖర్ను తొలగించి, సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా చేసింది.
ఆయన పట్టుబట్టడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ను సీఎం కుర్చీ నుంచి తొలగించారు. దీని తరువాత, కూడా సిద్ధూ కొత్త CM చన్నీపై కోపంతో, అలక వహించారు. దీంతో హైకమాండ్ కోపంగా ఉందని, రాజీనామాను ఆమోదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.