37.2 C
Hyderabad
May 6, 2024 14: 38 PM
Slider హైదరాబాద్

వామనరావు దంపతుల హత్యపై కూకట్ పల్లి న్యాయవాదుల నిరసన

#KukatpallyAdvocates

రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను నడి రోడ్డుమీద అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ లీగల్ సెల్ పిలుపు మేరకు కూకట్ పల్లి కోర్టులో నేడు న్యాయవాదులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాది వీరమల్ల కేశవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య జరిగి రోజులు గడుస్తున్నా సరే అధికారులలో చలనం లేదని, జంటహత్యల కేసులో విచారణ వేగవంతం చేసి నిజమైన నిందితులను పట్టుకొవాలని కోరారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థతో న్యాయ విచారణ జరిపించాలని, న్యాయవాదులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అఖిలేష్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కృష్ణ కుమార్, యాదయ్య, హరీష్ శంకర్ రెడ్డి, మల్లేష్, సుబ్బారావు, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, శంకర్రావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

13 వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

Satyam NEWS

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ లో ఘనంగా నవంబర్14

Satyam NEWS

స్నిప‌ర్ టీమ్ తో అసాంఘీక కార్య‌క‌లాపాల‌‌పై నిఘా

Satyam NEWS

Leave a Comment