40.2 C
Hyderabad
April 26, 2024 13: 15 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ లో ఘనంగా నవంబర్14

#kollapur

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ హై స్కూల్ లో సోమవారం నవంబర్ 14 పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి, ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడారు.

నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించిన మహనీయుడు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్నారు. ఆయనకు పిల్లలంటే అమితమైన ప్రేమ అన్నారు. అంతేగాకుండా దేశానికి దిశ, దశ నిర్ధేశించేది బాలలే అన్నారు. ధనిక, పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని నెహ్రూ ఆకాంక్షించారన్నారు. అందుకోసమే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల అందరూ పాల్గొన్నారు.

Related posts

తెలంగాణాలో 7వ శాఖను ప్రారంభించిన సానీ ఇండియా

Satyam NEWS

ఎన్ కౌంటర్ స్థలిలో చెల్లాచెదరుగా మృతదేహాలు

Satyam NEWS

ఉద్యమం కోసం ఉద్యోగాన్ని ధరపోశా

Satyam NEWS

Leave a Comment