నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ హై స్కూల్ లో సోమవారం నవంబర్ 14 పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి, ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడారు.
నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించిన మహనీయుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. ఆయనకు పిల్లలంటే అమితమైన ప్రేమ అన్నారు. అంతేగాకుండా దేశానికి దిశ, దశ నిర్ధేశించేది బాలలే అన్నారు. ధనిక, పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని నెహ్రూ ఆకాంక్షించారన్నారు. అందుకోసమే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల అందరూ పాల్గొన్నారు.