ములుగులోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవిర్భావ వేడుకలు మార్చి 15న జరుగగా కోవిడ్ తో మిగతా తంతు పూర్తిచేయలేకపోయిన ఆలయ కమిటీ సభ్యులు గురువారం మండల పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు.
ప్రధాన అర్చకులు తిరుక్కయ్యూర్ శ్రీనివాస స్వామీజీ, శ్రీనాథ శర్మ, సందీప్, శేషు తదితరులు శ్రీ సీతారామ చంద్ర స్వామికి అష్టోత్తర శతఘట అభిషేక హవనం నిర్వహించారు. మహిళలు పాలు, పెరుగు, పళ్లు, తేనె, నెయ్యి తదితర వస్తువులతో హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ సుతారి సతీష్, కొత్తపల్లి బాబురావు, ఒజ్జల లింగన్న, గంధం విజేందర్, కొత్తకొండ రమేష్, నన్నెవేన లింగన్న, ఎల్కతుర్తి రాజన్న, సల్పాల శ్రీను గంధం మహేందర్, ఇమ్మడి రాకేష్, గొర్రె అంకూస్, ఇమ్మడి రమేష్, కాపిడి ప్రభాకర్, తోట తిరుపతి, గుండెవేన రమేష్, ఓం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.