విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో ఇటీవలే ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు ఆ జాబితాలో జిల్లా కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న ఏఎస్ఐ విక్రమ్ ఒకరు.తాజాగా ఏఎస్ఐ విక్రమ్…ఎస్ఐ బాద్యతలు స్వీకరించారు.
మూడేళ్లలో పదవీ విరమణ పొందబోతున్న విక్రమ్ ను ఎట్టకేలకు ఎస్ఐ పదవి వరించింది.
డిప్యూటీ సీఎం పాముల పుస్పశ్రీవాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏకైనా పోలీస్ ఉద్యోగి.గత కొన్నేళ్ల నుంచీ ఎన్నో అవార్డులను సొంతం చేస్తున్న ఎం.విక్రమ్ రావు శాఖా పరంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు.
పోలీస్ శాఖలోపలు విభాగాలలో పని చేసి చివరకు ఎస్పీకి అత్యంత దగ్గరైన వింగ్ స్పెషల్ బ్రాంచ్ లో ఏఎస్ఐ గా ఉంటూ ఎట్టకేలకు ఎస్ఐ గా పదోన్నతి పొందారు.
ఇటీవల జరిగిన పంచాయితీ,మున్సిపల్ ఎన్నికలలో ఎప్పటికప్పుడు రెవిన్యూ యంత్రాంగపు సమాచారాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు స్పెషల్ బ్రాంచ్ హెడ్ ఆఫీసుకు సెకన్లలో పంపించి..శభాష్ అనిపించుకున్నారు..విక్రమ్.
తండ్రి నుంచీ నిజాయితీని ఆకలింపు చేసుకుని అటు వృత్తి, ఇటు ప్రవృత్తిలో మానవత్వం కలిగిన ఎస్ఐ విక్రమ్ రావు…పోలీస్ శాఖకు అత్యవసరమని అతను అందుకున్న అవార్డులు చెప్పకనే చెబుతున్నాయి.