మేడారం వెళ్లే భక్తులు రద్దీని దృష్టిలో లో పెట్టుకుని ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సూచికలు, వేగ పరిమితి బోర్డులు, రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేశామని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో రమేష్ రాథోడ్ తెలిపారు. భక్తులు ఖచ్చితంగా తమ సూచనలు పాటించాలని వారు కోరారు.
రక్షణ చర్యలు తీసుకోకుండా అతి వేగంతో వెళ్లి కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగల్చవద్దని వారు పేర్కొన్నారు. శనివారం రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు బోర్డుల ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వినోద్ కుమార్, పట్టణ సిఐ మల్లేష్ యాదవ్, వెహికిల్ ఇన్స్పెక్టర్ సాయి, ఎస్సై రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.