సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎం.పి.పి గుడేపు శ్రీనివాస్ ఇంటిని కూల్చి వేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఎం.పి.పి ఇంటికి వెళ్ళి జరిగిన విషయాలు తెలుసుకొని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు మాట్లాడుతూ బి.సి ల ఎదుగుదల చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.ఎస్సీ,ఎస్టీ,బిసి లు ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు.రానున్న కాలంలో బిసి లను గెలిపించాలని కోరారు.అన్ని అనుమతులు ఉన్నా ఎంపిపి ఇంటిని కూల్చి వేయడాన్ని రఘు ఖండించారు.
హుజూర్ నగర్ లో ఓ జర్నలిస్ట్ ను పలుమార్లు చంపివేయడానికి ప్రయత్నం చేశారని రఘు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓజో ఫౌండేషన్ తరపున ఆదివారం మంచ్యా తండాలో గిరిజన పండుగల సందర్భంగా ర్యాలీగా వెళుతుంటే అక్రమంగా పోలీసులును అడ్డం పెట్టుకొని గందరగోళం చేసి తనపై,తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించారని అన్నారు.
పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. వందల ఎకరాలు కబ్జా చేశారని,త్వరలోనే నియోజకవర్గ ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం అని అన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్