రెండు ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ఉద్యోగులకు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించబోతున్నారు. తెలంగాణ ఉద్యోగులకు 34 శాతం ఫిట్ మెంట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారు.
పిఆర్ సి ఎరియర్స్ ను 2018 జూలై నుండి చెల్లిస్తారని కూడా తెలిసింది. అదే విధంగా కేంద్ర ఉద్యోగుల తో సమంగా అలవెన్సులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిసింది.
సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పదవీ విరమణ 60కి పెంపు లాంటి నిర్ణయాలు కూడా ఆయన రేపు ప్రకటించనున్నారని తెలిసింది.
నాగార్జున సాగర్ ఎన్నికలు ముగియగానే టెట్ లేకుండా డీయస్సీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు.