మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, పొంగూరు నారాయణ పై అనంతపురంలో కొందరు దాడి చేశారు. నారాయణ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ నారాయణను వారు నిలదీశారు. మాజీ మంత్రి నారాయణ సమాధానం చెబుతున్నా వినకుండా వారు దాడి చేశారు.
వారు విద్యార్ధి సంఘాల నేతలు గా చెబుతున్నా వారి వెనుక రాజకీయ నాయకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. విద్యార్ది సంఘాల నేతలు, నారాయణ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నారాయణ షర్ట్ చిరిగిపోయింది. కారు అద్దాలను కూడా విద్యార్ధి సంఘాల పేరుతో వచ్చిన వారు ధ్వంసం చేశారు. తర్వాత పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనంతపురం పర్యటనను రద్దు చేసుకొని ఆయన వెనుదిరిగారు.