కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన ఉత్రా అనే వివాహిత హత్య కేసులో దోషిగా తేలిన ఆమె భర్త సూరజ్కు కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు రెండు జీవిత ఖైదులు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ శిక్షతోపాటు పాముతో కరిపించి హత్య చేసినందుకు మరో పదేళ్లు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడేళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో.. పాటు సూరజ్కు రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఈ కేసులో తీర్పుపై కేరళ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. భార్యను అంత కుట్ర పన్ని చంపిన ఆమె భర్తకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అనుకున్నట్టుగానే కోర్టు అతను జైలు గోడల మధ్య మగ్గిపోయేలా తీర్పు వెలువరించింది.