పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. ఈ బస్సు 4వ తేదీన రాత్రి 10 గంటల కు నరసరావుపేటలో బయలుదేరి శ్రీకాళహస్తి కాణిపాకం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకుంటూ అరుణాచలం వెళుతుంది. అక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని 6వ తేదీ సాయంత్రం బయలుదేరి నరసరావుపేట కు 7వ తేదీ ఉదయం నాలుగు గంటలకు చేరుతుంది.
నరసరావుపేట పట్టణం పరిసర గ్రామాల లోని భక్తులు, యాత్రాభిలాషులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్ కోరారు. టిక్కెట్టు వెల ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సునకు 2550/- గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 7382896041, 7382896038, 9959225428 సెల్ నంబర్లుపై సంప్రదించవచ్చునని డిపో మేనేజర్ తెలిపారు.