ప్రకాశం జిల్లాలో మళ్లీ కోవిడ్ టెన్షన్ మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పది రోజుల వ్యవధిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పై పలు హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు కరోనా పరీక్షలు ముమ్మరం చేశారు. జిల్లా లోని కురిచేడు, వేటపాలెంలో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
previous post
next post