29.7 C
Hyderabad
May 6, 2024 05: 27 AM
Slider వరంగల్

మేడారం జాతరకు వరంగల్ ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులు

Medaram-Jatara

మేడారం జాతర వెళ్లే భక్తులకు ములుగు జిల్లా ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి మండలాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వరంగల్ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 13 వ తేదీ నుండి 19 వరకు ప్రత్యేక బస్సులు ఉంటాయి.

ఆత్మకూరు మల్లంపల్లి మండలాలకు సంబంధించి ప్రయాణికులు ఎవరైనా 30 మంది బ్యాచ్ గా మేడారం జాతరకు వెళ్ళాలి అనుకుంటే  వారు 970157794 నెంబర్ కు  ఫోన్ చేసి బస్సు బుక్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. అదేవిధంగా ములుగు, జంగాలపల్లి నుండి బస్సులో మేడారం జాతరకు వెళ్లేందుకు 9059662555 నెంబర్ కు ఫోన్ చేయవచ్చునని ఆయన తెలిపారు.

ఆర్టీసీ బస్సుల  అన్ని మేడారం జాతర సమ్మక్క సారలమ్మ గద్దె లకు దగ్గరగా వెళ్తాయని, ప్రైవేటు వాహనాలు అన్నీ రెండు కిలోమీటర్ల దూరంలోని నిలుపుతారని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు. హనుమకొండ బస్టాండ్ నుంచి ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు.

Related posts

మరో యువతిపై ఇంట్లోనే అత్యాచార యత్నం

Satyam NEWS

5 Stats: కీలక ఎన్నికలకు మోగిన నగారా

Satyam NEWS

పాఠశాలలపై తుఫాను ప్రభావం

Sub Editor

Leave a Comment