ములుగు జిల్లా కేంద్రం లోని శ్రీ క్షేత్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు పొడిచేటి శేషాచర్యులు వేదమంత్రాలతో లక్ష్మీదేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సాయంత్రం మహిళలు పూజలో పాల్గొని అష్టైశ్వర్యాలు కలుగాలని వ్రతాలు వాయినాల కార్యక్రమాలతోపాటు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గండ్రకోట కుమార్, డా. సుతారి సతీష్, కొత్తపల్లి బాబూరావు, సలుపాల శీను, గంధం విజేందర్, భక్తులు పాల్గొన్నారు
next post