Slider ఆధ్యాత్మికం

ఆపద మ్రొక్కుల స్వామికి విశేష అభిషేక, అర్చనలు

#venkateswaratemple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం బైపాస్ రహదారిలో గల శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో  శుక్రవారం స్వామివారి నక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా వేకువజామున శ్రీ వారి మూల మూర్తికి పంచామృతాలతో, పంచసూక్త పారాయణతో ఆలయ అర్చకులు విశేష అభిషేకములు నిర్వహించారు. 

అనంతరం స్వామి,అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలతో, వివిధ జాతుల పుష్పాలతో విశేష అలంకరణ చేశారు.భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భక్తిశ్రద్ధలతో పఠించారు. స్వామివారికి విశేష అర్చనలు అనంతరం ధూప, దీప, నైవేద్యాలు, కర్పూర నీరాజనం,మహా మంత్రపుష్పం సమర్పించారు. పిదప తీర్థ ప్రసాద వినియోగం చేశారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక కైంకర్య కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవరం రవీందర్ రెడ్డి,కార్యదర్శి పశ్యా నారాయణరెడ్డి, కోశాధికారి కృష్ణారెడ్డి,విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అంతర్మథనం

Satyam NEWS

సొంత నేతలపై సీనియర్ నేత వ్యాఖ్యలు

Sub Editor

ఫైరింగ్ లో మెళకువలను వివరించిన ఏ.ఆర్ పోలీస్ అధికారులు

Bhavani

Leave a Comment