తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఐజేయూ) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ద్వితీయ మహాసభలు ఈనెల 14వ తేదీ బుధవారం రోజున షామీర్పేట్ తూముకుంట లోని మొగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హబ్సిగూడ లోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్లుజె ఐజేయు ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు పల్ల మహేందర్ రెడ్డి , ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి సురేష్, ఉపాధ్యక్షులు పంజాల శ్రీనివాస్ గౌడ్, రుద్రగొని నరసింహ గౌడ్, గార్లపాటి శ్రీనివాసరావు , జాఫర్, కొలను పాక చంద్రమౌళి శాలివాహన , రాంప్రసాద్ శర్మ, సతీష్, రవీందర్ రెడ్డి, కుమార్, నాగరాజు నేతలు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి , సాయి జన శేఖర్, గడ్డం రవికుమార్, గుడి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి