ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరేను నియమించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ. ప్రధాన మంత్రి కార్యాలయంలో రెండేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై ఈ పదవిని నిర్వహిస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆయన నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 1985 బ్యాచ్ జార్ఖండ్ కేడర్కు ఐఏఎస్ అధికారి అమిత్ సెప్టెంబరు 30న పదవీ విరమణ చేశారు. జాతీయ విద్యా విధానం – 2020 రూపకల్పనలో అమిత్ ఖరే క్రియాశీలక పాత్ర పోషించారు.