దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ హైదరాబాద్ వారి ఆదేశముల మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానము నందు శనివారం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రం,దేశం పాడి పంటలతో,సమస్త మానవాళికి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయం నుండి మేళ్ళచెరువు గ్రామంలో దేవాలయ ఉద్యోగులు,అర్చకులు,పోలీసు శాఖ సిబ్బంది, నవభారత్ పాఠశాల, కృష్ణవేణి హైస్కూల్ విద్యార్ధినీ,విద్యార్థులు, ఉపాధ్యాయులు,యాజమాన్యం,గ్రామ పౌరులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్