విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రంలో మొట్టమొదటిసారిగా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించడం హర్షణీయమని ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి,రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు.
రాజంపేట అసెంబ్లీ యూత్ వింగ్ ఇంచార్జ్ మరియు 27వ వార్డు కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ ఆధ్వర్యంలో శనివారం ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా రాజంపేట పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నూతనంగా ప్రతిష్టించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ తుపాకీ కి ఎదురుగా నిలబడి రొమ్ము విరిచిన వీరుడు అల్లూరి సీతారామ రాజు అని అన్నారు. స్వాతంత్ర సమయములో దేశం కోసం కృషిచేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశ రక్షణ కోసం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అన్సరియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు మదన్ రెడ్డి, క్షత్రియ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ సర్రాజు, ఆర్డిఓ కోదండరామిరెడ్డి, డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, కమిషనర్ జనార్దన్ రెడ్డి, తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, మదన గోపాలపురం ఎంపీటీసీ మధుబాబు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.