మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహద పడతాయని,క్రీడల్లో రాణిస్తు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని బి ఎల్ ఆర్ ట్రస్ట్ సభ్యుడు నేమూరీ మహేష్ గౌడ్ అన్నారు. ఆదివారం బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ కిట్లు (క్రీడా పరికరాలు) క్రీడాకారులకు తమ సొంత నిధులతో అందజేశారు. యువత చెడు మార్గం వైపు అడుగులు వెయ్యకుండా ఆటలు కాపాడుతాయి అని నేమురీ మహేష్ గౌడ్ అన్నారు. యువతకు చేయూత నివ్వడం అభినందనీయం అని కుషాయిగూడ ఎస్ ఐ ఉపేందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పి శ్రీనివాస్, వైజ్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, సెక్రెటరీ రాంబాబు, జాయింట్ సెక్రటరీ అశోక్ కుమార్ యాదవ్,. శంకరన్, నాగేశ్వర్ శర్మ, రంజిత్ రెడ్డి, సాయి కిరణ్, ముఖేష్ పాల్గొన్నారు. అనంతరం మహేష్ గౌడ్ ను సన్మానించారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి