విశాఖ శారదా పీఠానికి ఈ నెల 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు.
గత కొద్ది కాలంగా శారదా పీఠాన్ని సందర్శించాలని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కోరుతున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లలేకపోయారు.
శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా రావాలని స్వరూపానందేంద్ర కోరడంతో ముఖ్యమంత్రి అంగీకరించారు.
రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర ప్రధాన భూమిక పోషించిన విషయం తెలిసిందే.
వై ఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. తర్వాతి పరిణామాలతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.