శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్థంభం ప్రతిష్ట గద్వాల నియోజకవర్గ గద్వాల మండల పరిధిలోని ముల్కలపల్లి గ్రామం లోని శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గరుడ స్థంభం & ధ్వజస్థంభం, ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సర్పంచ్, ఎంపిటీసి, గ్రామస్తులు ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో ధ్వజస్తంభం, ప్రతిష్ట సందర్భంగా ఎమ్మెల్యే
కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరికీ అన్ని విధాలుగా రైతులకు అభివృద్ధి చెందాలి పాడి పరిశ్రమ పరంగా అన్ని
రంగాలలో గ్రామం అభివృద్ధి చెందాలని కోరారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగినది తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి గ్రామలో దేవాలయాలు
ఉండడంవల్ల ప్రజలలో భక్తి శ్రద్ధలతో దేవుని వార్డులో పూజించడం వల్ల శాంతి నెలకొల్పే గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలి ఆ దైవ అనుగ్రహం తో రాష్ట్రం, గద్వాల నియోజకవర్గం,
పాల్వాయి గ్రామ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య , బిఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్, సాయి శ్యామ్ రెడ్డి, నాగులు యాదవ్, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.