శ్రీకాకుళం పట్టణ శ్రీ సైనా యువజన సంఘం స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది చీపురు శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం మంత్రి ధర్మాన మాట్లాడుతూ శ్రీ సైనా యువజన సంఘం ఏ సహాయం కోరినా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ సైనా యువజన సంఘం స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది చీపురు శ్రీకాంత్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లావేటి హేమ సుందర్ రావు పాల్గొన్నారు.