39.2 C
Hyderabad
May 3, 2024 11: 24 AM
Slider ఆధ్యాత్మికం

కళ్యాణం కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అతి పురాతనమైన,ప్రాశస్త్యం సంతరించుకున్న శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెలలో ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగం అత్యంత రమణీయంగా జరిగింది.

ముందుగా విశ్వక్సేన ఆరాధన,స్వస్తి పుణ్య వచనము,యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళన,కన్యాధారా ఘట్టం,కన్యా వరణాలు, సుముహూర్త సమయానికి కి జీలకఱ్ఱ బెల్లం ధారణ,మాంగల్య పూజ,మాంగల్య ధారణ,తలంబ్రాల ఘట్ట వివాహ క్రతువులను అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చకులు నిర్వహించారు.
శ్రీ సీతారాముల కల్యాణానికి ప్రత్యేక అతిథులుగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,రజిత దంపతులు పాల్గొన్నారు.శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ క్రతువును తిలకించి, స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు శానంపూడి సైదిరెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,పాలకమండలి సభ్యులు, అర్చకులు,విశేష సంఖ్యలో భక్తులు, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,మహిళా నాయకులు, కౌన్సిలర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

గంగాడి సుదీర్ ‘కవనం’ ముఖచిత్రం ఆవిష్కరణ

Satyam NEWS

సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి రంగుపడింది!

Satyam NEWS

Leave a Comment