స్కందమాత అలంకారంలో నేడు భక్తులకు శ్రీశైల భ్రమరాంబదేవి దర్శనమిచ్చింది. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు జరిగాయి. అలాగే నవదుర్గ అలంకారంలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని స్కంద మాత రూపంలో అలంకరించారు.
శేషవాహనసేవలో భాగంగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న దంపతులు వ్యక్తిగతంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పుష్పాలతో చేసిన అలంకరణలు, దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మఠం విరూపాక్ష స్వామి దంపతులు తదితరులు పాల్గొన్నారు.