ములుగు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్ర రావు వేధింపుల వల్ల నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఈనెల 3న చేసుకున్నది.
రామకృష్ణ సెల్ఫీ వీడియో చూసినట్లయితే రాఘవేంద్రరావు పాల్వంచ ఏరియాలో అనేక దళిత గిరిజన కుటుంబాలను వేధింపులకు గురి చేసిన పాల్వంచ ఏరియాలో ఆడింది ఆట పాడింది పాటగా తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అనేక కుటుంబాలపై అరాచకాలు దాడి చేయడం ఓ గిరిజన కుటుంబంపై దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా కనిపిస్తుంది అని అన్నారు.
రామకృష్ణ సెల్ఫీ వీడియో ఆధారంగా వెంటనే రాఘవేంద్ర రావు ని అరెస్టు చేయాలని నేటికీ పోలీసులు అరెస్టు చేయలేదని రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వారి బంధుగణం ఏ విధమైన అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
పైగా వారికి వంత పాడుతుందని పేర్కొన్నారు. వెంటనే రాఘవేంద్ర చేయాలని పాల్వంచ ఏరియాలో రాఘవేంద్రరావు బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల రఘుపతి, ఎండి గపూర్ భాష, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొర్ర రాజు ,సిపిఎం పట్టణ కార్యదర్శి బోడ రమేష్ ,సిపిఎం నాయకులు లు గొల్లపల్లి యాకయ్య ,సిపిఎం మండల నాయకులు గోపాల్ రెడ్డి, కుమ్మరి సాగర్, తదితరులు పాల్గొన్నారు.