36.2 C
Hyderabad
April 27, 2024 21: 20 PM
Slider సినిమా

హీరోలు వచ్చారు వీరతాళ్లు వేయండి

#Megastar Chiranjeevi

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హీరోలు అమరావతి వచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సినీ ప్రముఖులు బృందం అక్కడ నుంచి ముఖ్యమంత్రికి కలుస్తుంది. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వారిలో హీరోలు  చిరంజీవి , నాగార్జున , దర్శకులు రాజమౌళి , నిర్మాతలు డి.సురేష్ బాబు తదితరులు ఉన్నారు.

సంతోషం. ఇక్కడే ఒక విషయం గుర్తుకు వస్తున్నది. ఈ పెద్ద పెద్ద హీరోలు అందరూ రాజధాని రైతులు దీక్షలు చేస్తుంటే ఎక్కడకు పోయారు? ఈ పెద్ద హీరోలు అందరూ రాజధాని కి చెందిన మహిళా రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేస్తుంటే ఒక్కరు కూడా వచ్చి పరామర్శించకపోగా అయ్యో పాపం అని స్టేట్ మెంటు కూడా ఇవ్వలేదు.

రాజధాని భూముల నుంచి రైతులను తరిమి కొడుతుంటే కూడా ఈ హీరోలు పలకలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, రాజధాని ఉండదేమోనని భయంతో ఆందోళనతో చనిపోయినా కూడా ఈ హీరోలు పట్టించుకోలేదు. తెలుగు చిత్ర పరిశ్రమను తాము ఎంతో ఆదరిస్తున్నామని, తాము కష్టాలలో ఉన్నప్పుడు పరామర్శించాలని కోరినా బతిమిలాడినా ఏ ఒక్క హీరో కూడా రాలేదు సరికదా రాజకీయాలతో మాకు సంబంధం లేదని చెప్పారు.

ఇప్పుడు సినిమా షూటింగ్ ల విషయం వచ్చే సరికి హైదరాబాద్ నుంచి ఎంతో శ్రమ పడి మరీ హీరోలు అందరూ అమరావతి వరకూ వెళ్లారు. రైతుల బాధలు చూడకుండా, పట్టించుకోకుండా చిత్ర పరిశ్రమ పేరుతో స్వలాభం కోసం షూటింగ్ లకు అనుమతి కోరేందుకు వచ్చిన ఈ హీరోల చిత్రాలు చూడటం అవసరమా? అందరూ ఆలోచించి సామాజిక స్పృహలేని హీరోల సినిమాలను బహిష్కరిస్తేనే వారికి కూడా బాధ తెలిసి వస్తుంది. ఇందులో కులాల ప్రస్తావన రాకుండా చూసుకోండి రైతులారా

Related posts

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో వైభవంగా ధ్వజావరోహణం

Bhavani

బాపట్ల ఎంపిపై రఘురాముడి హక్కుల నోటీసు

Satyam NEWS

జీతాల కోసం క్లాప్ మిత్రల డిమాండ్

Satyam NEWS

Leave a Comment