రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై పట్టణాల్లో, పల్లెల్లో ఉన్న కాలనీ వరకు కూడా కరోనా బారిన పడి అనేక మంది మరణించినప్పటికీ, ఆసుపత్రులను అదనంగా పెంచడం గానీ, మందులు ఇవ్వడం గానీ రెమిడీసివర్ అందివ్వడంలో భరోసా కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆది శ్రీనివాస్ అన్నారు.
ప్రభుత్వం కరోనా అరికట్టడంలో విఫలమైంది..కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.