రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు ఆయన రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.