39.2 C
Hyderabad
May 3, 2024 13: 06 PM
Slider నల్గొండ

టోల్ గేట్: కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోతున్నాయి

komatireddy 12

టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచి పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అందుకే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల వాహనాల రద్దీపై ఆదివారం ఎంపీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పండగ ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందుల నడుమ కొనసాగడం పట్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు పోతున్న ప్రయాణికులు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నరని, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పంతంగి, పగిడిపల్లి, కొర్లపాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలవడం దారుణమన్నారు. దీనిపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్ లో మాట్లాడానని కోమటిరెడ్డి తెలిపారు.

Related posts

2 లక్షల మంది విద్యార్థులకు చేరువైన ఐఐటీ-జే ఈఈ ఫోరం

Satyam NEWS

షర్మిలకు జగన్ అప్పు ఎందుకు ఇచ్చాడు?

Satyam NEWS

ఇంద్రకీలాద్రి లో భవానీ దీక్షావిరమణ కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment