STU TS సభ్యత్వ నమోదు కార్యక్రమం ములుగు జిల్లాలో ప్రారంభించారు. STU TS ములుగు మండల శాఖ అధ్యక్షులు గన్నోజు ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏళ్ళ మధుసూదన్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. మోడల్ స్కూల్, బండారుపల్లి, జాకారం, మల్లంపల్లి, కోయగూడం, భూపాల్ నగర్ పాఠశాల ల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు.
ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల రేష్నలైజేషన్ GO ను పూర్తిగా వ్యతిరేకిస్తూ… పాత జిల్లాల ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేసారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా వేతనాలు చెల్లించి వారికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు. Kgbv ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మండల శాఖ అధ్యక్షులు బండారి జగదీశ్, గోవిందరావుపేట అధ్యక్షులు పోరిక రాజన్న, ములుగు మండల శాఖ ఆర్థిక శాఖ కార్యదర్శి రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.