ఆంధ్రరాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్ర రెడ్డి నెల్లూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్ యస్ యస్ వాలంటీర్, రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత, జాతీయ ఉత్తమ అవార్డుకు నామినేట్ అయిన పార్థసారథిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డా. విజయక్రిష్ణరెడ్డి, విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు ఆచార్య సుజా ఎస్ నాయర్, డా. ఆర్ వి కృష్ణ రెడ్డి, డా.విజయలక్ష్మి, ఎస్ యస్ యస్ కోఆర్డినేటర్ డా ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
previous post