38.2 C
Hyderabad
April 29, 2024 13: 52 PM
Slider వరంగల్

ఎంపీపీ ఎస్ పాఠశాలల ఆధ్వర్యంలో విజ్ఞాన విహార యాత్ర

warangal

ములుగు జిల్లా లోని గ్రామాల ఎం పి పి ఎస్ పాఠశాల  విజ్ఞాన విహారయాత్ర శనివారం కార్యక్రమం నిర్వహించారు. ములుగు మండలం లోని  బండారుపల్లి, బరిగలోని పల్లి , బంజరుపల్లి జంగాలపల్లి క్రాస్ రోడ్డు, సోమల పల్లి, మంచినీళ్ళ పల్లి పాఠశాల ల నుండి విజ్ఞాన విహారయాత్ర కోసం వరంగల్ నగరం లోని చారిత్రక ప్రదేశాలు ఐన వేయి స్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం, ఖిల్లా వరంగల్, జూ పార్క్ లకు తీసుకు వెళ్లి విద్యార్థుల కు వాటి పట్ల అవగాహన కల్పించారు.

ఈ విధమైన క్షేత్ర పర్యటన ల వల్ల విద్యార్ధులకు మానసిక ఉల్లాసం తో పాటు స్వయంగా చూసి నేర్చుకోవడం వల్ల ఎక్కువ గుర్తుకు ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పర్యటనలో విద్యార్థుల తో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం పోశమ్మ, వెంకటేశ్వర్ రెడ్డి, శ్యామ్ సుందర్, రాజేందర్, శ్రీమాన్, నర్సింగరావు, శివరాం, శ్రీలత, అరుణ్ జ్యోతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మన సినిమా వాళ్ళు ఇప్పటికైనా మారాలి

Satyam NEWS

గిఫ్ట్: శ్రీ పద్మావతి అమ్మవారికి వెండి ఆవు, దూడ

Satyam NEWS

పేరు చివరిలో ఆ రెండు అక్షరాలు ఉంటేనే పదవి

Satyam NEWS

Leave a Comment