ములుగు జిల్లా లోని గ్రామాల ఎం పి పి ఎస్ పాఠశాల విజ్ఞాన విహారయాత్ర శనివారం కార్యక్రమం నిర్వహించారు. ములుగు మండలం లోని బండారుపల్లి, బరిగలోని పల్లి , బంజరుపల్లి జంగాలపల్లి క్రాస్ రోడ్డు, సోమల పల్లి, మంచినీళ్ళ పల్లి పాఠశాల ల నుండి విజ్ఞాన విహారయాత్ర కోసం వరంగల్ నగరం లోని చారిత్రక ప్రదేశాలు ఐన వేయి స్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం, ఖిల్లా వరంగల్, జూ పార్క్ లకు తీసుకు వెళ్లి విద్యార్థుల కు వాటి పట్ల అవగాహన కల్పించారు.
ఈ విధమైన క్షేత్ర పర్యటన ల వల్ల విద్యార్ధులకు మానసిక ఉల్లాసం తో పాటు స్వయంగా చూసి నేర్చుకోవడం వల్ల ఎక్కువ గుర్తుకు ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పర్యటనలో విద్యార్థుల తో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం పోశమ్మ, వెంకటేశ్వర్ రెడ్డి, శ్యామ్ సుందర్, రాజేందర్, శ్రీమాన్, నర్సింగరావు, శివరాం, శ్రీలత, అరుణ్ జ్యోతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.