ఏం జరిగిందో ఏమో కానీ 16 ఏళ్ల పిల్లాడిని నరికి చంపేశారు. దారుణమైన ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల కేంద్రంలో జరిగింది.
16ఏళ్ళ బాలుడిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హత్యకు గురైన బాలుడు అఫ్రిద్.. మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నట్టు తెలిసింది.
ఇద్దరు పిల్లల మధ్య జరిగిన స్వల్ప ఘర్షణే హత్యకు దారితీసిన వైనం.
సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.