29.7 C
Hyderabad
May 3, 2024 06: 30 AM
Slider విజయనగరం

డ్రగ్స్, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి

#police

విద్యార్థులు మత్తు పదార్ధాలకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని విజయనగరం పోలీసు సబ్ డివిజన్ లో వన్ టౌన్ లో విద్యార్థులకు వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు  పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించేందుకు గాను విజయనగరం లోని ఆర్ కె జూనియర్ కళాశాల విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ – విద్యార్థుల జీవితాలను నాశనం చేసే డ్రగ్స్, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే విచక్షణ కోల్పోయి, తామేమీ చేస్తున్నామన్న విషయం మరిచి, నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు కలిగించే గంజాయి, హెరాన్, నల్ల మందు, మద్యం, డ్రగ్స్ బారిన పడవద్దన్నారు.

అదే విధంగా సెల్ ఫోన్లను అతిగా వినియోగించడం వలన విద్యార్థులు చెడు మార్గం పడుతున్నారన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న, చక్కగా విద్య మీద దృష్టి పెట్టి, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. ఎవరైతే క్రమ శిక్షణతో నడుచుకొంటూ, ఉన్నతమైన చదువులతో ముందుకు వెళ్తారో వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో మంచి స్థానాలకు చేరుకున్న వారికి సమాజంలో గౌరవం లభిస్తుందని, తద్వారా మీ తల్లిదండ్రులకు, మీరు నివసిస్తున్న ప్రాంతానికి, దేశానికి మంచి ఖ్యాతి లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, లక్ష్య సాధనకు కృషి చెయ్యాలని సీఐ డా బి.వెంకటరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ ఆర్ కే జూన్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వన్ టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మునిసిపల్ సిబ్బందికి ఆర్ఎంపిల సహకారం

Satyam NEWS

స్నిప‌ర్ టీమ్ తో అసాంఘీక కార్య‌క‌లాపాల‌‌పై నిఘా

Satyam NEWS

హౌ టు విన్:రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి మంత్రి పదవి మటాష్

Satyam NEWS

Leave a Comment