ములుగు జిల్లా చిన్న గుంటూరు పల్లి గ్రామంలోని లావుడ్యా లక్ష్మీ పరంసింగ్ దంపతుల కనిష్ఠ కుమార్తె సుజాత సురేష్ వివాహానికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ సభ్యులు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ హాజరయ్యారు.
నూతన వధువు వరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పెళ్లి రోజు జ్ఞాపిక గా సబ్ రిజిష్టర్ దంపతులు నూతన వస్త్రాలు, సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ తరుపున చిరు కనుక అందించారు.
ఈ కార్యక్రమంలో సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ సభ్యులు సత్య, మామిడి పెళ్లి రమేష్, రాజ్ కుమార్,సాయి, రాసమల్ల హేమంత్, లావుడ్యా సుక్రమ్, అతిని శ్రీకాంత్, కుక్క అశోక్, బుర్ర రత్నాకర్, గుడిమల్ల శ్రీనివాస్,బన్నీ,మార్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.