38.2 C
Hyderabad
April 28, 2024 22: 41 PM
Slider ఆధ్యాత్మికం

ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవ‌తారోత్స‌వాలు

#tiruchanoor

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రిగాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

Related posts

కరోనాపై పోలీస్ కళాబృందం పాటలు ఆవిష్కరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు

Satyam NEWS

రిషి కుటుంబ నేపథ్యం ఇదీ

Satyam NEWS

Leave a Comment